కరోనా వైరస్ నేపథ్యంలో ఓ తల్లి తన పిల్లలను రెండు నెలల తర్వాత కలుసుకున్న ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో ఓపిడి వద్ద సుసీ అనే ఓ మహిళ విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో సుసీ తన ఇద్దరు కూతుళ్లను బంధువుల ఇంట్లో ఉంచి.. కరోనా బాధితులకు సేవలందిస్తుంది. దీంతో తొమ్మిది వారాలపాటు ఆ పిల్లలిద్దరూ తల్లికి దూరంగా ఉంటున్నారు. అయితే, తన కూతుళ్లకు చెప్పకుండా కలుకొని సర్ప్రైజ్ చేయాలనుకుంది సుసీ. దాదాపు రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్లిన సుసీ.. సోఫాలో కూర్చున్న తన కూతుళ్ల వెనకకు వెళ్లి నిలబడింది. అందులో ఒక బాలిక వెనుకకు తిరిగ్గానే తల్లి కనిపించడంతో గట్టిగా మమ్మీ అని అరుస్తూ కౌగిలించుకుంది. రెండు నెలల తర్వాత తల్లి కనబడడంతో ఆ పిల్లలిద్దరూ సంతోషంతో తల్లిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/Lottsoflove21/status/1267756463927316480
Healthcare worker mom meets daughters after 2 months