Friday, April 19, 2024

బస్వాపూర్ వద్ద ఉప్పొంగిన మోయా తుమ్మెద వాగు

- Advertisement -
- Advertisement -

కోహెడ: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ వద్ద మోయా తుమ్మెద వాగు ఉప్పొంగింది. సిద్దిపేట టు హన్మకొండ వెళ్లే రాకపోకలకు అంతరాయం కలిగింది. మోయా తుమ్మెద వాగు ఉధృతికి ఇటీవల తంగళ్లపల్లి “పిల్లి వాగు బ్రిడ్జి” కొట్టుకపోయింది. దీంతో కోహెడ నుంచి శనిగరం రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు శనిగరం రాజీవ్ రహదారిని చేరుకోవాలంటే నానా తంటాలు పడుతున్నారు. ఇతర పల్లెల రోడ్ల మీదుగా తిరిగి ఇబ్బందులు పడుతూ శనిగరం చేరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News