Friday, April 19, 2024

కేరళలో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన కేరళలో భారీ వర్షం ముంచెత్తుతుండడంతో భారత వాతావరణ శాఖ(ఐఎండి) ఆ రాష్ట్రానికి చెందిన 7జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లం, పథనంథిట్ట, అలప్పుళ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కీ జిల్లాల్లో ఈ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా తిరువనంతపురం జిల్లాలోని అరువిక్కర, నెయ్యార్, పెప్పర రిజర్వాయర్ల నుంచి నీటిని వదిలిపెట్టారు. కేరళకు ఇప్పటి వరకు నాలుగు అదనపు జాతీయ విపత్తు దళాలను నియుక్తించారు. ప్రస్తుతానికి రెండు దళాలు ఇప్పపటికే పనిచేస్తున్నాయి. కేరళ రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ కోరిక మేరకు మరో నాలుగు టీమ్‌లు తమిళనాడుకు చెందిన అరక్కోణం నుంచి రానున్నాయి.

మలప్పురంలో భారీ వానలకు ఓ ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మరణించారు. కొండచరియలు విరిగిపడ్డం వల్ల ఆ ఇల్లు కూలిపోయింది. స్థానికులు గాయపడ్డ ఆ చిన్నారులను కొజికోడ్ మెడికల్ కాలేజ్‌కు తీసుకువెళుతుండగానే వారు మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News