Thursday, April 25, 2024

ఉప్పొంగుతున్న శనిగరం ప్రాజెక్ట్: అధికారులు అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట్: చిన్న కోడూరు మండలం మల్లారం గ్రామంలో వేకువ జామున కురిసిన భారీ వర్షాలకు మల్లారం వాగు పొంగి పొర్లుతుంది. దీంతో మల్లారం గ్రామంలోని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డ్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లో నీట మునిగిన పంప్ హౌజ్ ను జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా వర్షపు నీటిని ఎత్తిపోసి హైదారాబాద్ కు సాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సివరేజి బోర్డ్ జనరల్ మేనేజర్ బ్రిజేష్ ను కలెక్టర్ ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో శనిగరం ప్రాజెక్ట్ ఉప్పొంగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కలెక్టర్ చెప్పారు. రెవెన్యూ, ఇరిగేషన్, మిషన్ భగీరథ, వ్యవసాయ, అనుబంధ రంగాలు, పంచాయితీ రాజ్, ఆర్అండ్ బి శాఖల అధికారులు రెండు రోజులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Heavy Rains: Siddipet inspects Shanigaram Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News