Tuesday, April 23, 2024

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో నిర్మల్‌ జిల్లా పరిధిలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టకు 72,151 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 73,002 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్టు అధికారలు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిన నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 697 అడుగుల వద్ద నీరు ఉందని అధికారులు వెల్లడించారు.

Heavy water Inflow to Kadem Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News