Thursday, April 25, 2024

వివాహితను ప్రియుడి చంపి…. నగలతో…

- Advertisement -
- Advertisement -

Her killed by lover in mahaboobnagar

మహబూబ్ నగర్: వివాహితను ప్రియుడి హత్య చేసి అనంతరం ఆమె పై ఉన్న నగలతో పారిపోయిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లాపూర్  గ్రామంలో శంకరయ్య గౌడ్- లక్ష్మీ దేవీ అనే దంపతులు నివసిస్తున్నారు. లక్ష్మీ దేవి భూత వైద్యం చేసేది. తన కూతురు స్వాతిని లక్ష్మీ దేవి కల్వకర్తికి తీసుకెళ్లి హాస్టల్ లో వదిలిపెట్టింది. కూతురిని వదిలి పెట్టి తన సొంతూరుకు బయలుదేరింది. గ్రామానికి ఆమె రాకపోవడంతో తన భార్య కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో శంకరయ్య గౌడ్ ఫిర్యాదు చేశాడు. బోయినపల్లి శివార్లలోని పీర్లమాన్య గుట్టపైకి సీతాఫలాల కోసం రవి ప్రకాశ్ రెడ్డి వెళ్లాడు. గుట్టపై మృతదేహం కనిపించడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మీ దేవిగా గుర్తించారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుడు గంగిరెద్దుల వెంకటయ్యగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. మృతురాలు గ్రామానికి చెందిన వెంకటయ్య ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్ని రోజుల అతడిని ఆమె దూరం పెట్టడంతో చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. పీర్లగుట్టపై బంగారం ఉందని తవ్వుతున్నామని అక్కడికి రావాలని ఆమెకు అతడు సమాచారం ఇచ్చాడు. ఆమె అక్కడికి రాగానే అత్యాచారం చేశాడు. అనంతరం రాయితో బాది హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలతో పారిపోయాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సిఐ జములప్ప తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News