Thursday, April 25, 2024

సైబర్ క్రైం పోలీసులకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : తనను వివాహం చేసుకున్నానని సునిషిత్ అసత్య ప్రచారం చేస్తున్నాడని హీరోయిన్ లావణ్య త్రిపాఠి నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అసిస్టెంట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెయిల్‌లో వివరాలు తెలిపింది. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వూల్లో లావణ్యపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే మిగతా హీరోయిన్లపై కూడా వ్యాఖ్యలు చేశాడు.

మహిళలను కించపరిస్తే చర్యలుః కెవిఎం ప్రసాద్, సైబర్ క్రైం ఎసిపి
యూట్యూబ్ ఛానెల్స్‌లో సునిశిత్ చేసిన వ్యాఖ్యలు పరిశీలించామని తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. సునిశిత్ ఇతర సెలబ్రిటీలపై కూడా వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. ఇప్పటి వరకు హీరోయిన్ లావణ్య మాత్రమే ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Heroine Lavanya Tripathi complains to cyber crime police
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News