- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో నటి ప్రియమణి శుక్రవారం పాల్గొని మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో మధురైలోని కోయిల్పట్టిలో ప్రియమణి మొక్కలు నాటారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, కెమెరామెన్ శ్యాం కె నాయుడు, నటుడు రామరాజు, మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు కోసం అందరూ మొక్కలు నాటాలని ఆమె కోరారు. పెళ్లి రోజు, పుట్టిన రోజులకు బహుమతులు ఇవ్వకుండా మొక్కలు నాటించాలన్నారు.
Heroine Priyamani plant Sapling in Madurai
- Advertisement -