- Advertisement -
హైదరాబాద్ : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏ మాత్రం సందేహం వున్న అక్కడ్నించి నేరుగా అనంతగిరి రిసార్ట్సులో నెలకొల్పిన క్వారెంటైన్ సెంటర్కు తరలించేందుకు రెడీ అవుతున్నాయి తెలంగాణ వైద్య వర్గాలు. ఎయిర్ పోర్టులో గుర్తించే కరోనా అనుమానితులు, లక్షణాలు కలిగిన వ్యక్తుల తరలింపునకు ఏర్పాట్లను రెట్టింపు చేశారు. 15 అంబులెన్సులను అందుబాటులో వుంచారు. అదనపు సిబ్బందిని నియమించారు. శంషాబాద్ విమానాశ్రయం ఏరియాలో 144 సెక్షన్ వాతావరణం ప్రతిబింబిస్తోంది. ఎయిర్ పోర్టుకు వస్తున్న ప్రతి విమాన ప్రయాణికుడ్ని వైద్య బృందాలు స్క్రీనింగ్ చేస్తున్నాయి. విదేశాలనుండి వచ్చే వారిని అవసరం మేరకు క్వారెంటైన్ సెంటర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
High alert at Shamshabad airport with Corona effect
- Advertisement -