Friday, March 29, 2024

హైలైట్‌గా బోట్ ఫైట్..

- Advertisement -
- Advertisement -

highlight Boat Fight sequence in Pushpa

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎలాంటి సినిమా తెరకెక్కించినా కూడా ప్రేక్షకుల మెదడుకు ఎంతో కొంత పని పెడుతుంటాడు. ‘రంగస్థలం’ లాంటి కమర్షియల్ డ్రామాలో కూడా విభిన్నమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించి స్క్రీన్‌ప్లే మాస్టర్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో మాత్రం ఫుల్ యాక్షన్‌తో ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చబోతున్నట్లు తెలిసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ అనగానే మరో ‘ఆర్య’ లాంటి సినిమా వస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ఈ దర్శకుడు ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక హెవీ యాక్షన్ కథను ఎంపిక చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా సుకుమార్ ఈ రేంజ్ లో ప్రయోగాలు చేయలేదు. పైగా మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి సుకుమార్ తన క్రియేటివిటీని మొత్తం ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలిసింది. అలాగే నెవర్ బిఫోర్ అనేలా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయట.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక సముద్రంలో జరిగే బోట్ ఫైట్ సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం. టాప్ మోస్ట్ ఫైట్ మాస్టర్స్‌ను ఎంపిక చేసుకున్న సుకుమార్ ఇంతకుముందెన్నడు కూడా చూడని ఒక బోట్ ఫైట్‌ను చూపిస్తాడట. అందుకోసం నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ ఎంత పెరిగినా కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఆ బోట్ సీన్ ఫస్ట్ పార్ట్‌లో ఉంటుందా లేదా సెకండ్ పార్ట్‌లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.

highlight Boat Fight sequence in Pushpa

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News