- Advertisement -
మహబూబ్ నగర్: హిజ్రాగా మారి.. మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని జడ్చర్ల మండలం, నక్కలబండ తండాలో ఘటన చోటుచేసుకుంది. తనను బలవంతంగా హిజ్రాగా మార్చారని, ప్రస్తుతం కడపలో ఉన్నానని తండాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు తన బంధువులకు వీడియో కాల్ ద్వారా తెలిపాడు. తనలాగే జడ్చర్లకు చెందిన మరో ముగ్గురు హిజ్రాల చెరలో ఉన్నట్లు చెప్పి వీడియో కాల్ లైవ్ లోనే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Hijra Suicide in Kadapa who belongs to Jadcherla
- Advertisement -