Thursday, April 25, 2024

ఆస్ట్రేలియాలో హిందూ ఆలయం అపవిత్రం

- Advertisement -
- Advertisement -

ఖలీస్థాన్ శక్తుల అరాచకం, గోడలపై విద్వేష రాతలు

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాలో ఖలీస్థానీ శక్తులు అరాచకానికి దిగాయి. భారత్‌పట్ల తమ విద్వేషాన్ని చాటుకున్నాయి. మెల్‌బోర్న్‌లోని ప్రఖ్యాత స్వామినారాయణ హిందూ దేవాలయంపై దాడికి దిగి, గోడలపై పరుషపదజాలపు రాతలు, ఇతరత్రా చర్యలతో మలినపర్చాయి. ఈ ఘటనను ది ఆస్ట్రేలియా టుడే పత్రిక గురువారం ఓ వార్తాకథనంలో తెలిపింది. మెల్‌బోర్న్ ఉత్తర శివార్లలోని మిల్ పార్క్ వద్ద నెలకొని ఉన్న ఈ దేవాలయం స్థానిక హిందువులకు ఆరాధ్య మందిరంగా ఉంది.

ఖలీస్థానీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న దుండగులు ఈ మందిరం వద్ద ఇష్టారాజ్యానికి దిగారు. గోడలపై హిందూస్థాన్ ముర్దాబాద్ అని రాశారు. ఇక్కడ కొద్ది సేపు గుమికూడిన ఈ బృందం విద్వేష ప్రసంగాలకు కూడా పాల్పడింది. ఖలీస్థానీ నేత జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలేను కొనియాడుతూ , భారతదేశాన్ని, హిందువులను దూషిస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. ఈ ఘటన పట్ల స్వామినారాయణ్ ఆలయ సంబంధిత బిఎపిఎస్ ట్రస్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విధమైన విధ్వంసకర, విద్వేష పూరిత చర్యలు గర్హనీయం అని తెలిపింది.

జరిగిన ఘటన అనుచితం అని, తాము వెనువెంటనే శాంతి సామరస్యం కోసం ప్రార్థనలు నిర్వహిస్తామని , ఆ తరువాత సమగ్ర స్థాయిలో ప్రకటన వెలువరిస్తామని తెలిపారు. జరిగిన ఘటన బాధాకరం అని నార్తర్న్ మెట్రోపాలిటన్ ప్రాంతపు లిబరల్ ఎంపి ఎవన్ ముల్హోలండ్ స్పందించారు. విక్టోరియాకు చెందిన శాంతికాముకులైన హిందూ సామాజిక వర్గం పట్ల ఇప్పటి ఈ పవిత్ర కాలంలో ఇటువంటి అవమానకర చర్య జరగడం దారుణం అని ఈ ఎంపి తమ ప్రకటన వెలువరించినట్లు ది ఆస్ట్రేలియా టుడే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News