Friday, March 29, 2024

హిందుత్వ రాద్ధాంతం

- Advertisement -
- Advertisement -

 

స్వామి వివేకానంద పాశ్చాత్య తాత్వికతలు చదివారు. హిందు ఆధ్యాత్మికతగా, మానవ మతతత్వంగా అద్వైత వేదాంతానికి కొత్త అర్థం చెప్పారు. 11.09.1893న షికాగో ప్రపంచ మతాల సభలో హిందు ఆధ్యాత్మికత, జాతీయవాదాన్ని తెలిపారు. ఈ తత్వాన్ని గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందుకు తీసుకెళ్లారు. నేటి హిందు జాతీయవాదానికి ప్రేరణనిచ్చారు. సంఘ్ ఆరాధ్యుడు ఉమాకాంత్ ఆప్టే, ఆర్.ఎస్. ఎస్.కు వివేకానంద భగవద్గీత అన్నారు. వివేకానంద మత సామరస్యత, మానవ వాదాలు బోధించారు. కుల వ్యవస్థను తిరస్కరించారు.

Hinduvu story in Telugu

ఫాసిస్టు భావజాలం ప్రజల్లో సుస్పష్ట ఐక్యత తెస్తుంది. హిందుసేన పునర్నిర్మాణానికి హిందు భారత్‌కు అలాంటి సంస్థ కావాలి. హెగ్డేవార్ ఆధ్వర్యంలోని మన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అలాంటిదే. 1931లో ఇటలీ ఫాసిస్టు నియంత ముసోలినిని కలిసిన తర్వాత హిందు జాతీయవాద నాయకుడు బాలకృష్ణ శివరాం మూంజ్. సంఘ్ పరివార్ సంస్థలు నాజీ హిట్లర్, ఫాసిస్టు ముసోలినిలతో ప్రేరణ పొందాయి. హిందువులకు ప్రత్యేక హక్కులు కావాలని వాదిస్తున్నాయి.

ఇండో ఆర్యన్‌ల సంస్కృత పదం సింధు నుండి హిందు పుట్టింది. సంపద పోగేసుకోటం (అర్థ), కోరికలు తీర్చుకోటం (కామ), పునర్జన్మ నుండి ముక్తి పొందటం (మోక్ష) హిందుమత ధర్మాలు. హిందు, భారతీయం ఒకటే. భారతీయులంతా హిందువులే. భారత్ హిందుదేశం. భారత ఉపఖండ ప్రజలందరు హిందువులు. భారత్ వారి పితృభూమి, పుణ్యభూమి. ఆక్రమణ దారులు నాశనం చేసిన హిందు సంస్కృతిని పునరుద్ధరించాలి. ఇది హిందుత్వవాదం. హిందుత్వం విద్యార్థులు సంస్కృతం, వైదిక జ్ఞానం నేర్చుకోవాలంటుంది. ఖిలాఫత్ ఉద్యమ ముస్లిం రాజకీయాలను ప్రతి చర్యగా అనుకరించింది. హిందుత్వ సూత్రకారుడు సావర్కర్, ఆర్.ఎస్.ఎస్. రెండవ ప్రధాన కార్యదర్శి గోల్వాల్కర్‌ల ప్రవచనాలు హిందుత్వ తాత్వికతకు ఆదర్శాలు.

ముస్లిం ద్వేషి బంకించంద్ర ఛటోపాధ్యాయ 1870 లో ముస్లిం వ్యతిరేక ఆనంద్ మఠ్ నవలలో వందేమాతరం యుద్ధ గీతం రాశారు. హిందు దేశ స్థాపన కలలుకన్నారు. బెంగాలి హిందుత్వవాది చంద్రనాథ్ బసు ‘హిందుత్వ’ పుస్తకంలో హిందుత్వ పదం మొదటగా రాశారు. గుర్తింపు కోసం సావర్కర్ దీన్ని ప్రచారం చేశారు. మతం- సంస్కృతి, ఉమ్మడి దేశం, ఉమ్మడి జాతి, ఉమ్మడి సంస్కృతి సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. హిందుత్వంలో హిందు, జైన, బౌద్ధ, సిక్కు మతాలను చేర్చారు. సంఘ్ పరివార్ సంస్థలు హిందుత్వను హైందవ జాతి ఐక్యతా ఉద్యమంగా ప్రచారం చేశాయి. నాస్తిక సావర్కర్‌కు ముస్లింలు శత్రువులు, బ్రిటిష్ దోపిడీ కంటే ముస్లిం సంస్కృతి అపాయకరం. హిందుత్వం విశాల భావాల మానవ భాష. ప్రజల ఆధ్యాత్మిక చరిత్ర కాదు. సంపూర్ణ మానవ చరిత్ర. సావర్కర్ అతిశయించారు. హిందుత్వం హిందు విశ్వాసాల, ఉన్నత కుల పెత్తనాల రాజకీయ ఉద్యమం. రాజ్యాధికారం పొందటానికి మార్గాలు చూపిన పిడివాదం.

భారత ప్రధాన న్యాయమూర్తి, మధ్వ బ్రాహ్మణ గజేంద్ర గడ్కర్ హిందుమతం సంకీర్ణమన్న నియోగి బ్రాహ్మణ హిందుత్వ సమర్థకుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ నివేదికను ఆమోదించారు. హిందుత్వ న్యాయవాది రాం జెఠ్మలానీ హిందుత్వం మత ఛాందసవాదం కాదని కోర్టు తీర్పును వక్రీకరించారు. రాజ్యాంగ నిపుణుడు సుప్రీంకోర్టు న్యాయవాది ఎ.జి.నూరాని, ఈ తీర్పు హిందుత్వానికి అనుకూల అర్థాన్నిచ్చింది. హిందుత్వాన్ని భారతీయీకరించింది. మతం, రాజకీయాల మధ్య అడ్డుగోడను కూల్చేసింది అన్నారు.
సావర్కర్ దేశాన్ని హిందుత్వ ప్రాతిపదికన పునర్నిర్మించాలన్న ఆశయంతో అండమాన్ జైలు నుండి వచ్చారు. 1921లో ఆయనను మహారాష్ట్రలో రత్నగిరి జైలుకు తరలించారు. అక్కడ హిందుత్వ శీర్షికతో కరపత్రం రాశారు. ఇది హిందుత్వవాదులకు హిందుదేశ సిద్ధాంతంగా బోధపడింది. లౌకికవాదులకు మత ప్రాతిపదికన దేశాన్ని చీల్చేదిగా, ముస్లింలను బలి పశువులను చేసేదిగా అర్థమైంది. సావర్కర్ కు ముందు వివేకానంద, దయానంద సరస్వతి, తిలక్ వంటి వారు హిందు పునరుద్ధరణ చేపట్టారు. సావర్కర్ హిందు పునరుజ్జీవనాన్ని రాజకీయ కోణంలో నిర్వచించారు.

హిందుత్వం, హిందుమతం ఒకటి కాదన్నారు. హిందు వేదకాలంది అన్నారు. ఆనాటి నుండే భారత్ హిందుదేశమన్నారు. ఈ దేశాన్ని పితృభూమిగా, పుణ్య భూమిగా పరిగణించేవారంతా హిందువులే. ఈ ప్రాతిపదికన సిక్కులు, బౌద్ధులు, జైనులు హిందువులు. ముస్లింలు, క్రైస్తవులు జాతీయవాదులైనా వారి పుణ్యభూములు అరేబియా, ఇజ్రాయిల్‌లలో ఉన్నాయి. వారు హిందువులు కారు అని వ్యాఖ్యానించారు.
స్వామి వివేకానంద పాశ్చాత్య తాత్వికతలు చదివారు. హిందు ఆధ్యాత్మికతగా, మానవ మతతత్వంగా అద్వైత వేదాంతానికి కొత్త అర్థం చెప్పారు. 11.09.1893న షికాగో ప్రపంచ మతాల సభలో హిందు ఆధ్యాత్మికత, జాతీయవాదాన్ని తెలిపారు. ఈ తత్వాన్ని గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందుకు తీసుకెళ్లారు. నేటి హిందు జాతీయవాదానికి ప్రేరణనిచ్చారు. సంఘ్ ఆరాధ్యుడు ఉమాకాంత్ ఆప్టే, ఆర్.ఎస్.ఎస్.కు వివేకానంద భగవద్గీత అన్నా రు. వివేకానంద మత సామరస్యత, మానవ వాదాలు బోధించారు. కుల వ్యవస్థను తిరస్కరించారు. ముస్లిం సహకారం లేకపోతే మానవ జాతికి విలువ లేదు. మత గ్రంథాల అవసరంలేని స్థితికి మానవజాతిని చేర్చాలి. ప్రజలు ఆకలితో మాడుతుంటే మనకు నిద్రెలా వస్తుంది? కులకొట్లాటలతో ప్రయోజనం లేదు. తక్కువ కులస్థులను కించపరచటంతో వారు ముస్లింలుగా, క్రైస్తవులుగా మారారు. మానవ జీవితం గోజీవితం కంటే విలువైనది. ఇవీ వివేకానందుని ప్రవచనాలు.

గాంధీ వర్ణాశ్రమ ధర్మాలను నమ్మిన హిందు భక్తుడు. లౌకికత్వం, ఆధ్యాత్మికతలను అనుసంధానించారు. సామాజిక, రాజకీయ తాత్వికతలో రామరాజ్య భావాల ప్రచారం చేశారు. స్వాతంత్య్రమంటే బ్రిటిష్ దిగువ సభ, సోవియట్ పాలన, ఇటలీ ఫాసిజం, జర్మనీ నాజీయిజం కాదు. నైతికాధికారాల ప్రజల సర్వసత్తాక రామరాజ్యం. అట్టడుగు పౌరునికీ న్యాయం అందించగల ప్రజాస్వామ్యం. అన్ని మతాలను గౌరవించగలది అని గాంధీ వక్కాణించారు. సోవియట్ పాలనను ఫాసిజం, నాజీయిజంలతో పోల్చారు. మత నైతికతను రాజకీయాల్లోకి తెచ్చారు.

తొలినాళ్ళలో వర్ణ వ్యవస్థను, అంటరానితనాన్ని సమర్థించారు. సావర్కర్ లాగా రాజకీయ తీవ్రవాదాన్ని మత మూకలోకి చొప్పించలేదు. భారతీయులంతా హిందువులుగా ఉండాలన్న సావర్కర్ సంకుచిత హిందుత్వం, మతాలన్నీ కలిసి బతకాలన్న గాంధీ హిందుమతానికి వ్యతిరేకం. సావర్కర్‌తో, హిందుత్వంతో సమీప సంబంధం గల హిందుమతోన్మాది గోడ్సే గాంధీని చంపారు. గాంధీ హిందు మతాన్ని ప్రేమించినా ఏ మతాన్నీ అగౌరవించలేదు. గాంధీ మతం మానవత్వం, మానవ సేవ, సర్వోదయం.

నెహ్రూ లౌకిక విధానం ఆచరించారు. 1960లలో కాంగ్రెస్ హిందుత్వ రాజీ ధోరణి మొదలైంది. 1964లో విశ్వ హిందు పరిషత్ స్థాపించారు. గోవధ నిషేధ ఉద్యమం మొదలెట్టారు. 1967లో కాంగ్రెస్ ప్రభావం తగ్గింది. మిశ్రమ ప్రభుత్వాల్లో జన సంఘ్ అధికారం పంచుకుంది. గోవధ నిషేధ ఉద్యమం సాగిన ఉత్తరప్రదేశ్ లో గెలిచింది. ఇందిర ఎమర్జెన్సీలో ఆర్.ఎస్.ఎస్., జనసంఘ్‌ల అంటరానితనం పోయి బలపడ్డాయి. కాంగ్రెస్, వామపక్షాలు బలహీనపడ్డాయి. సంఘీయులు హిందుకు బదులు భారతీయవాడారు. భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ, ప్రజాసంస్థలకూ భారతీయ జోడించారు.
అయోధ్య మందిర్ ఉద్యమం మొదలెట్టారు. అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేతతో హిందుత్వం వేళ్లూనుకుంది. వాజ్‌పేయి పాలనలో చాపకింద నీరులా పారింది. కాంగ్రెస్, ఇతర పాలక పక్షాలు హిందుత్వ మెతక ధోరణి పాటించాయి. 2004 నుండి పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏర్పడ్డ అఘాతంలో అభివృద్ధి నాయకునిగా డబ్బా కొట్టుకున్న మోడీ దిగబడ్డారు. రెచ్చగొట్టే అబద్ధాల ఉపన్యాసాల, ప్రచార పటాటోపాల, ఉద్వేగ మతోన్మాదాలతో కుర్చీలో స్థిరపడ్డారు. బ్రాహ్మణేతర హిందువులూ బ్రాహ్మణత్వాన్ని పూసుకున్నారు. హిందు జాతీయవాదం ముస్లిం వ్యతిరేక రూపం దాల్చింది. మోడీ షా- యోగి కాషాయత్రయంలో హిందుత్వ ఆగడాలు పెరిగాయి. హిందుత్వం విజృంభిమది.

మత పెద్దలు ప్రేక్షక పాత్ర వదలాలి. మతోన్మాదంతో తామూ నష్టపోతామని గుర్తించాలి. హిందుత్వ వాదాన్ని ఎదిరించవలసిన ప్రత్యేక బాధ్యత హిందువులుగా పుట్టిన ప్రగతిశీలురది. విద్యార్థులకు, ప్రజలకు మానవీయశాస్త్రాలు, సామాజిక, సాంస్కృతిక అంశాలు నేర్పాలి. శాస్త్రీయ దృక్పథం అలవర్చాలి. జీవపరిణామక్రమం తెలపాలి.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News