- Advertisement -
ఛండీగఢ్: భారత హాకీ మాజీ ఆటగాడు బల్బీర్సింగ్ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని పోర్టిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 1948, 1952, 1956 ఒలింపిక్స్ లో ఆడి మూడు స్వర్ణాలు తీసుకరావడంలో ఆయన పాత్ర ఎనలేదని. 1975 ప్రపంచ కప్ గెలిచిన ఇండియా హాకీ టీమ్ కు కోచ్, మేనేజర్ గా ఉన్నాడు. ఒలింపిక్స్ పురుషుల విభాగంలో హాకీ ఫైనల్స్ లో అత్యధిక గోల్స్ సాధించిన రికార్డు బల్బీర్ పేరుపైనే ఉంది. బల్బీర్ కు కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు.
- Advertisement -