Friday, April 19, 2024

హాకీ సమాఖ్య రూ.25 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను తనవంతు సహాయంగా భారత హాకీ సమాఖ్య భారీ విరాళాన్ని ప్రకటించింది. క్రికెట్‌తో పోల్చితే తక్కువ మొత్తంలో ఆదాయం కలిగిన హాకీ సమాఖ్య కూడా భారీగా విరాళం అందించి పెద్ద మనసును చాటుకుంది. కరోనా బాధితుల సహాయార్ధం 25 లక్షల రూపాయల విరాళాన్ని అందించాలని హాకీ సమాఖ్య నిర్ణయించింది. ఈ మొత్తాన్ని పిఎం కేర్స్‌కు అందిస్తున్నట్టు సమాఖ్య అధ్యక్షుడు మొహ్మద్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. కరోనా నివారణ కోసం ఈ నిధులను వినియోగించాలని కోరారు. ఇక, కరోనాను అరికట్టేందుకు దేశంలో జరుగుతున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఆయన కోరారు. సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తూ లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని సూచించారు.

Hockey India Donates Rs 25 lakh For Fight Against Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News