మన తెలంగాణ/సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం విధులు నిర్వహిస్తూ వడదెబ్బకు గురై మరణించిన హోంగార్డు సిలివేరి దేవయ్య మృతి పట్ల ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం తీవ్ర సంతాపం ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లికి చెందిన సిలివేరి దేవయ్య (50) బుధవారం సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటనలో ఉండగా వడదెబ్బకు గురై మృతి చెందాడు. మంత్రి కెటిఆర్ గురువారం హోంగార్డు దేవయ్య మృతికి సంతాపం వ్యక్తం చేయడంతో పాటుగా వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటించి, తన వ్యక్తిగతంగా రూ.5 లక్షలు ఆర్థిక సహయం అందించనున్నట్లు వెల్లడించారు. మృతి చెందిన హోంగార్డు దేవయ్య కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని మంత్రి కెటిఆర్ ప్రకటించారు. కాగా, మృతునికి భార్య భారతి, కూతురు నవ్య, కుమారుడు సాయిప్రకాశ్ ఉన్నారు.
Home Guard died due to Sunstroke in KTR’s Sircilla Tour