Saturday, April 20, 2024

కరోనా పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స: మంత్రి ఈటల

- Advertisement -
- Advertisement -

Home treatment for Corona Patients: Minister Etela

 

హైదరాబాద్: మహమ్మారి కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స అందిస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ హైదరాబాద్‌లో చికిత్స అందించడం అసాధ్యమని.. అందుకే జిల్లా కేంద్రాల్లోనే ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ఈటల అన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిలోనే కరోనా చికిత్స అందిస్తామన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య పెరిగితే ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, ఇంట్లోనే కరోనా చికిత్సకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు. వృద్ధులకు, ఆరోగ్య సమస్యలున్నవారికి కరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, కరోనా సోకకుండా ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా ప్రభుత్వ సూచనలు పాటించాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు.

Home treatment for Corona Patients: Minister Etela

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News