Friday, March 29, 2024

పరువు హత్య….. అక్కను చంపిన సోదరుడు

- Advertisement -
- Advertisement -

Honour killing: UP brother killed sister

లక్నో: కులాంతర వివాహం చేసుకుందని అక్కను తుపాకీతో సోదరులు కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్‌పూరీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జ్యోతి మిశ్రా (20), రోహిత్ యాదవ్ (25) అనే యువతియువకుడు ప్రేమించుకున్నారు. 2018 ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. దీంతో జ్యోతి కుటుంబ సభ్యులు తన కూతురును కిడ్నాప్ చేశారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా తాము మేజర్లమని ప్రేమికులు కోర్టుకు ఎక్కారు. జ్యోతి సోదరుడు గుల్షాన్ మిశ్రా అప్పుడే ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. వాళ్లను చంపాలని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. జ్యోతి కుటుంబ సభ్యులు ఆ ప్రేమజంట మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకొచ్చారు. గుల్షాన్ తన ఇద్దరు సోదరులతో కలిసి జ్యోతిపై తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం రోహిత్‌పై కాల్పులు జరిపి ఘటనా స్థలం నుంచి పారిపోయారు. జ్యోతి ఘటనా స్థలంలోనే చనిపోగా రోహిత్‌ను సాఫాయి ఆస్పత్రికి తరలించారు. రోహిత్ కడుపులోకి బల్లెట్ దిగిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి, బిసి వర్గానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతో తన కుటుంబం పరువుపోయిందని, అందుకే ఆమెను హత్య చేశామని కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మోయిన్‌పూరీ ఎస్‌పి అజయ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News