Thursday, April 25, 2024

విద్యుత్ షాక్‌తో గృహిణి మృతి

- Advertisement -
- Advertisement -

Housewife dieD of electric shock

 

రాజన్న సిరిసిల్ల/తంగళ్లపల్లి: ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ కు గురై గృహిణి మృతి చెందిన సంఘటన మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గడ్డం వైష్ణవి రెండు రోజుల క్రితం ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వచ్చారు. ఇంట్లోని బట్టలు ఉతికేందుకు బాత్‌రూంలోకి వెళ్లింది. అక్కడే బకీట్‌లో వేసిన వాటర్ హీటర్ ప్రమాద వశాత్తు కాలికి తగలడంతో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మరణించింది. బాత్ రూం నుండి అలికిడి వినబడకపోవడంతో భర్త దినకర్ వెంటనే అక్కడికెళ్లి చూసే సరికి అప్పటికే మరణించి ఉంది. పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి కొడుకులు దీపాన్ష్(5), హిమాన్ష్(3)లు ఉన్నారు. ఈ సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News