Friday, March 29, 2024

స్వలింగ దంపతులకు సామాజిక ప్రయోజనాలు ఎలా అందుతాయి?

- Advertisement -
- Advertisement -
కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: స్వలింగ జంటలకు ఉమ్మడి బ్యాంకు ఖాతాలు తెరవడం లేదా బీమా పాలసీలలో భాగస్వామిని నామినేట చేయడం వంటి ప్రాథమిక సామాజిక హక్కులను కల్పించడానికి ప్రభుత్వం మార్గాన్ని కనుగొనాలి, స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడం పార్లమెంట్ ప్రత్యేక హక్కుగా భావిస్తోందని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది.

స్వలింగ వివాహాలను గుర్తించాలని, రక్షించాలని దాఖలైన సామూహిక అప్పీళ్ళను కోర్టు పరిశీలిస్తోంది. వివాహం చేసుకునే హక్కును నిరాకరించడం, వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించి, వివక్ష, వెలికి దారితీస్తోందని పిటిషనర్ల వాదనను విచారిస్తోంది.
స్వలింగ జంటకు వివాహ హోదా ఇవ్వకుండా కొన్ని విషయాలను ఎలా పరిష్కరిస్తారు అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తగిన రెస్పాన్స్‌తో బుధవారం తిరిగి కోర్టుకు రావాలని సాలిసిటర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది.

‘మేము ఈ రంగంలోకి వస్తే, ఇది శాసనసభ వేదిక అవుతుందని మేము, మీ అభిప్రాయాన్ని తీసుకుంటాము. ఇప్పుడేమిటి? ‘సహజీవనం’ సంబంధాలతో ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటోంది? భద్రత, సామాజిక సంక్షేమ భావం ఎలా ఏర్పడుతుంది? అలాంటి సంబంధాలు బహిష్కరించబడకుండా చూడాలా?’ అని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News