- Advertisement -
బంధించి పులిచింతల ప్రాజెక్టులో వదిలిన అధికారులు
మఠంపల్లి: సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలం, యాతవాకిళ్ల చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్సకారుల వలలో భారీ మొసలి చిక్కింది. శుక్రవారం యాతవాకిళ్ల గ్రామానికి చెందిన కొంత మంది మత్సకారులు సమీప చెరువులో చేపల వేటకు వెళ్లారు. ఓ మత్సకారుడు మదర్ వలలో భారీ మొసలి పడింది. దీంతో ఆయన ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. మదర్ మరో నలుగురు సహచరులతో కలసి చాకచక్యంగా మొసలిని బంధించారు. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ కోలాహలం లక్ష్మీనరసింహరాజుకు తెలియజేశారు. ఆయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరుణాకర్, కానిస్టేబుల్ ప్రదీప్రెడ్డికి సమాచారం ఇచ్చారు. వారు గ్రామానికి చేరుకుని మొసలిని పులిచింతల ప్రాజెక్టులో వదిలిపెట్టారు.
Huge crocodile in the trap of fishermen
- Advertisement -