Friday, April 26, 2024

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.53 కోట్లు

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 29,712 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 13,381 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.53 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. నిన్న ఆన్ లైన్ లో స్వామివారి సర్వదర్శనం టోకెన్లు టిటిడి విడుదల చేసింది. రోజుకు 8వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోతే నెగెటీవ్ రిపోర్టు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.

Huge devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News