Friday, March 29, 2024

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

Huge Devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 74,748మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 39,086మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు సమర్పించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్నీ కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటలకు పైగా సమయం పడుతుంది. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.45కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

Huge Devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News