Friday, March 29, 2024

తిరుమలలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు స్వామివారి దర్శనం కోసం 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా.. టికెట్ ఉన్న భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 57,147 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 26,094 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్టు టిటిడి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News