Friday, March 29, 2024

నేడు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 28,601 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 13,653 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.84 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. ఈరోజు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ రోజు విఐపి దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. రేపు సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. భక్తులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోతే నెగెటీవ్ రిపోర్టు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు.

Huge devotees visited Tirumala Srivari Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News