Wednesday, April 24, 2024

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది.

కాగా, నిన్న(మంగళవారం) శ్రీవారిని 75,875 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో స్వామివారికి 35,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.07 కోట్ల ఆదాయం వచ్చినట్టు టిటిడి వెల్లడించింది. ఈరోజు 300 దర్శన టికెట్లను టిటిడి విడుదల చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News