Thursday, March 28, 2024

సైబరాబాద్‌లో భారీగా ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్సైల బదిలీ

- Advertisement -
- Advertisement -

Huge transfer of inspectors and SI in Cyberabad

 

ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్

మనతెలంగాణ, హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇన్స్‌స్పెక్టర్స్ ఆఫ్ పోలీసులు 6, ఎస్సైలు 13మందిని వివిధ స్టేషన్లకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజేంద్రనగర్ ఇన్స్‌స్పెక్టర్ జి. సురేష్‌ను గచ్చిబౌలికి, రాజేంద్రనగర్ డిఐ రాజును మోయినాబాద్ ఎస్‌హెచ్‌ఓగా, గచ్చిబౌలిలో పనిచేస్తున్న శ్రీనివాస్‌ను సిటిసికి, ఆర్‌జిఐ పిఎస్‌లో పనిచేస్తున్న కనుకయ్యను రాజేంద్రనగర్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. 4సిలో పనిచేస్తున్న ఎస్సై పి. అనిల్ కుమార్‌ను నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సిఎఆర్‌కు అటాచ్డ్‌గా ఉన్న జానయ్యను సైబరాబాద్ క్రైంకు బదిలీ చేశారు. సైబరాబాద్ క్రైంలో పనిచేస్తున్న ఇన్స్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌ను రాజేంద్రనగర్ డిఐగా నియమించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News