Friday, April 26, 2024

సోషల్ మీడియాలో దుష్ప్రచారం బాధించాయి: సుదర్శన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Hurt in Social media fake news

 

వరంగల్ రూరల్: సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వల్ల జరిగిన పరిణామాలు తీవ్రంగా బాధించాయని ఎంఎల్‌ఎ సుదర్శన్ రెడ్డి తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జరిగిన పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల సన్నాహక సమావేశంలో సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. నర్సంపేట నియోజకవర్గానికి గిరిజన పాఠశాలతో పాటు అత్యధిక విద్యా సంస్థలకు అనుమతులు మంజూరు చేశామన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News