- Advertisement -
అమరావతి: వేర్వేరుగా ఉంటున్న ఇద్దరు భార్యలను కలిసుందామని ఇంట్లోకి తీసుకొచ్చి వారిపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన విశాఖపట్నంలోని గూడెంకొత్తవీధి మండలం పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వంతల నాగరాజు అనే వ్యక్తి ఇద్దరు భార్యలతో కలిసి గూడెం కాలనీలో నివిసిస్తుండేవాడు. ఇద్దరు భార్యలు లక్ష్మి, సుశీల వేర్వేరుగా ఉండడంతో కలిసుందామని కబురు పంపాడు. ఇద్దరు భార్యలు ఇంటికొచ్చిన తరువాత మద్యం సేవించి వచ్చిన నాగరాజు వారిపై కత్తితో దాడి చేశాడు. వెంటనే గ్రామస్థలు గాయపడిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
Husband attack on wife with knife in andhra pradesh
- Advertisement -