Thursday, March 28, 2024

స్కూల్‌కి వెళ్తున్న భార్యపై ఐరన్ రాడ్డుతో దాడి.. స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం… మహమ్మద్ యూసుఫ్ కు కరీనా బేగంతో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
వీరికి ముగ్గురు పిల్లలున్నారు. సంవత్సరం నుండి భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు.

భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం కాపు కాసి కరీమా బేగం స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఐరన్ రాడ్డుతో రోడ్డుపైనే దాడి చేసి హతమార్చాడు. స్థానికులు నిందితుల్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News