Saturday, April 20, 2024

పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న భార్యపై భర్త కేసు

- Advertisement -
- Advertisement -

Husband case against wife celebrating Pak win

లక్నో: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా భారత్ పాక్‌ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ ఓ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. ఈ మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఓ ఇల్లాలు చేసిన పని ఆమె కాపురాన్ని కూల్చింది. ఆ ఇల్లాలు పాక్‌కు మద్దతు తెలుపుతూ.. భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని భర్త ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. షంగన్ ఖేడాకు చెందిన ఇషాన్ మియా, రబియా షంషీ ఇద్దరూ భార్యాభర్తలు. అక్టోబర్ 24న పాక్ చేతిలో భారత్ ఓటమి తర్వాత రబియా, ఆమెకుటుంబ సభ్యులు టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వాట్సాప్ స్టేటస్‌లోను తమ సంతోషాన్ని పంచుకున్నారు. దీంతో చిర్రెత్తిపోయిన ఇషాన్ భార్య రబియా షంషీ, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News