- Advertisement -
లక్నో: తన చావుకు భార్య, బావమరుదులే కారణమని ఓ వ్యక్తి విషం తాగి వీడియో తీసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మోరాదాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మనీష్ శర్మ అనే వ్యక్తి ఓ హోటల్ మేనేజర్గా పని చేస్తున్నాడు. రామ్గంగా విహార్ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని భార్యతో కలిసి ఉంటున్నాడు. గత కొన్ని రోజులగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య, ఆమె కుటుంబ సభ్యులు మనీష్ను వేధిస్తుండడంతో వాళ్ల వేధింపులు తట్టుకోలేక విషం తాగాడు. అనంతరం తన చావుకు భార్య, ఆమె కుటుంబ సభ్యుల కారణమని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఆత్మహత్యపై పోలీసులు ఐపిసి 306 కింద కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.
- Advertisement -