- Advertisement -
తిరువనంతపురం: ఓ వ్యక్తి తన భార్యకు మద్యం తాగించి… ఐదేళ్ల కుమారుడు ముందు భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్కు పాల్పడిన సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఓ వ్యక్తి తన భార్య, ఐదేళ్ల కుమారుడును పుతుకురిచీలో ఓ బీచ్కు తీసుకెళ్లాడు. అనంతరం అతడి స్నేహితుల ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు. ఆమెపై నలుగురు స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం చేసి సిగరెట్లతో కాల్చారు. భర్త ఆమెను ఇంటికి తీసుకొచ్చిన తరువాత భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి భర్తతో పాటు మరో నలుగురు నిందితులను అరెస్టు చేశామని తిరువనంతపురం ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు.
- Advertisement -