Friday, March 29, 2024

ప్రేమ పెళ్లి… స్నేహితులతో కలిసి భార్యను కిడ్నాప్ చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

Husband kidnap to wife with friends

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థలు రావడంతో పుట్టింట్లో ఉంటున్న భార్యను స్నేహితులతో కలిసి భర్త కిడ్నాప్ చేసిన సంఘటన ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దామల్ల సుధాకర్, రజిని అనే దంపతులకు శాంతి(21) అనే అమ్మాయి ఉంది. ఉద్యోగం చేస్తూ సుధాకర్ తన కుటుంబంతో కలిసి హన్మకొండలో ఉంటున్నాడు. శాంతి బిఎస్‌సి నర్సింగ్ చదువుతోంది.

కాలేజీ సెలవులు రావడంతో భూపాలపల్లి జిల్లా స్తంభంపల్లిలో తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ బాలరాజు అనే యువకుడితో పరిచయం ఏర్పడడంతో ప్రేమగా మారింది. ఏడు నెలల క్రితం పెద్దలను ఒప్పించి ఆ ప్రేమ జంట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. శాంతి-బాలరాజు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ ఇంట్లో ఎవరు లేని సమయంలో శాంతిని గత నెలలో స్నేహితులతో కలిసి భర్త కిడ్నాప్ చేశాడు. గతంలో బాలరాజుపై కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. భర్త నుంచి తప్పించుకొని శాంతి పుట్టింటికి చేరుకుంది.

నర్సింగ్ పరీక్షలు పూర్తయిన తరువాత పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి పంపిస్తామని బాలరాజుకు అత్తింటి వారు సమాచారం ఇచ్చారు.  బుధవారం సుధాకర్ సొంతూరు గోవిందరావు పేటకు బాలరాజు వెళ్లి అడ్డుపడిన అత్త రజిని, బావమరిది సృజన్‌ను పక్కకు తోసేసి శాంతిని తన స్నేహితులతో కలిసి బలవంతంగా కారులో తీసుకెళ్లాడు. వెంట రజిని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News