Friday, April 19, 2024

పెళ్లైన నాలుగు నెలలకే భార్యను హత్య చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: వివాహం జరిగిన నాలుగు నెలలకే అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప వైఎస్‌ఆర్ జిల్లా బద్వేలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుందరయ్య కాలనీలో హరి అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. హరి నాలుగు నెలల క్రిత మంజుల అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై అనుమానం పెంచుకొని గత రాత్రి భార్యను హత్య చేశాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News