Wednesday, April 24, 2024

పొట్టిగా ఉందని భార్యను చంపేశాడు….

- Advertisement -
- Advertisement -

Husband killed wife after suicide plan at kurnool

 

అమరావతి: పొట్టిగా ఉందని భార్య చేత సూసైడ్ నోట్ రాయించి అనంతరం భార్యను భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ప్యాపిలి ప్రాంతంలో జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రవి నాయక్‌కు సుశీలా బాయితో వివాహమైంది. భార్య పొట్టిగా ఉండడంతో పలుమార్లు వేధించడంతో పాటు భార్య చెల్లెలుపై మనసు పడ్డాడు. దీంతో పొట్టిగా ఉన్న భార్యను వదిలించుకుంటే మరదలను రెండో పెళ్లి చేసుకోవచ్చని భావించాడు. భార్యను హతమార్చడానికి రేఖా నాయక్ సహాయం తీసుకున్నాడు. సుశీలా భాయ్ దగ్గరకు వెళ్లి రేఖా నాయక్ సూసైడ్ లెటర్ రాయించుకున్నాడు.

జూన్-14న మేకలు కాసేందుకు అడవికి భార్యను భర్త తీసుకెళ్లాడు. ప్లాన్ ప్రకారం అడవిలోకి వెళ్లిన తరువాత రాయితో సుశీలా తలపై మోదాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఆమెను లోయలోకి నెట్టేశాడు. అతడు ఇంటికి వచ్చిన అనంతరం తన భార్య సూసైడ్ చేసుకుందని లెటర్ రాసి వెళ్లిపోయిందని స్థానిక పోలీసులకు తెలిపాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. రెండు రోజుల అనంతరం మృతదేహం కనిపించడంతో కాపరులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం సుశీలదిగా గుర్తించారు. అల్లుడు రవినాయక్‌పై తమకు అనుమానం ఉందని సుశీలా తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవి నాయక్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్యా చేశానని ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News