Wednesday, April 24, 2024

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని…

- Advertisement -
- Advertisement -

husband killed wife at secunderabad

సికింద్రాబాద్: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను హతమార్చిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. మంగళవారం అర్దరాత్రి సమయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాంధీ ఆసుపత్రి సమీపంలోని మెట్రో పిల్లర్ వద్ద భార్యభర్తలు గౌతమ్ ( 30) , మహాలక్ష్మీ ( 28) భిక్షాటన చేస్తూ యాచకులుగా జీవనం కొనసాగిస్తున్నారు. మద్యానికి బానిసగా మారిన గౌతమ్ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యతొ తరచూ గొడవ పడుతూ హింసించేవాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి మూడు గంటల సమయంలో మందు తాగడానికి డబ్బులు ఇవ్వాలని ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న భార్యను వేదించసాగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పటికే తప్పతాగి ఉన్న గౌతమ్ విచక్షణ కోల్పోయి భార్య మహాలక్ష్మీపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహాలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న చిలకలగూడ పోలీసులు పోస్టుమార్టుం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు గౌతమ్ పై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News