Thursday, March 28, 2024

తండ్రిని చంపిన భర్తను హత్య చేసిన భార్య

- Advertisement -
- Advertisement -

Husband killed wife in nagarkurnool

నాగర్ కర్నూలు: తండ్రిని భర్త హత్య చేశాడని కోపంతో రగిలిపోయిన భార్య… అతడితో మంచిగానే ఉంటూ తన పుట్టింటి వారితో కలిసి అతడిని చంపిన చేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రాంతం మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాలుగు సంవత్సరాల క్రితం శంకర్(28)కు మమతతో వివాహం జరిగింది. పొలం దగ్గర తరుచు మామ-అలుళ్ల మధ్య గొడవలు జరిగేవి. రెండు సంవత్సరాల క్రితం కూలీ పనుల నిమిత్తం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి మామ-అల్లుళ్లు వెళ్లారు. అక్కడ ఇద్దరు మధ్య గొడవ జరగడంతో రాయితో మామ తలపై అల్లుడు శంకర్ కొట్టాడు. ఈ కేసులో జైలు కెళ్లిన అల్లుడు కొన్ని రోజులు తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రిని హత్య చేసిన భర్తను చంపాలని సమయం కోసం భర్త వేచి చూస్తోంది. భర్తతో కలిసి ఉంటూ అతడి హత్యకు ప్లాన్ వేసింది. తన పుట్టింటి వారిని ఇంటికి పిలుపించుకొని శంకర్ నిద్రపోయాక గొంతు నులిమి హత్య చేసింది. మృతదేహాన్ని నల్లగొండ జిల్లా నిడమనూరు సాగర ఎడమ కాలువలో పడేసింది. శంకర్ అన్న రవీందర్ నాయక్ 19న అతడికి పోన్ చేయడంతో స్విచ్ఛాప్ రావడంతో మరదలిని అడిగాడు. ఆమె తెలియదని సమాధానం ఇవ్వడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో శంకర్ భార్య మమతను అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు ఒప్పుకుంది. వెంటనే హత్యలో మమత కుటుంబ సభ్యులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News