Friday, April 26, 2024

భర్తను బతికించుకుంటే…. అతడే కాలయముడయ్యాడు….

- Advertisement -
- Advertisement -

Husband killed wife in Rangareddy

రంగారెడ్డి: మద్యానికి బానిసగా మారిన భర్త భార్యను గొడ్డలితో నరికి చంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసరపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎర్గమని మహేందర్ పదిహేను సంవత్సరాల క్రితం సరమ్మతో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు జశ్వంత్(13), కుమార్తె(10) తేజ ఉన్నారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి మహేందర్ మద్యానికి బానిసగా మారాడు. దీంతో కుటుంబంలో ప్రతి రోజు గొడవలు జరుగుతున్నాయి. గతంలో మద్యం మత్తులో మహేందర్ పురుగుల మందు సేవించాడు. వెంటనే భార్య అతడిని ఆస్పత్రికి తరలించి సపర్యలు చేసి భర్తను దక్కించుకుంది. శనివారం పూటుగా తాగివచ్చిన భర్త ఆమెతో గొడవపడ్డాడు. అందరూ పడుకున్న తరువాత పిల్లలని మరో రూమ్ లో పడుకోబెట్టి భార్య తలపై గొడ్డలితో బాదాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో పిల్లలు లేచి తన నానమ్మ, పెద్ద నాన్న ఇంటికి పరుగులు తీశారు. అప్పటికే అతడు బైక్ పారిపోయాడు. గ్రామ శివారులోకి వెళ్లిన అనంతరం ఓ పొదల మధ్య దాక్కున్నాడు. గ్రామస్థులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News