Thursday, March 28, 2024

భార్యను కాటువేసిన పామును చంపి….

- Advertisement -
- Advertisement -

జైపూర్: భార్యను కరిచిన పామును చంపి అనంతరం పాము కళేబరాన్ని ఆస్పత్రి తీసుకొచ్చిన సంఘటన రాజస్థాన్‌లో ఉదయ్ పూర్ జిల్లాలోని గోగుండా ప్రాంతంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఉండిథాల్ గ్రామానికి చెందిన అంబలాల్ అనే వ్యక్తి తన భార్య దేవ్లీ భాయ్‌తో కలిసి ఇంట్లో పడుకున్నాడు. అర్ధ రాత్రి సమయంలో భార్యను పాము కాటు వేయడంతో ఆమె కేకలు పెట్టింది. వెంటనే పామును అంబలాల్ చంపి తువ్వాలలో కట్టుకున్నాడు. భార్యతో పాటు పాము కళేబరాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు పరీక్షించి ఆమెకు చికిత్స చేస్తుండగా ఈ పాము కాటు వేసిందని తువ్వాల నుంచి బయటకు తీశాడు. వెంటనే ఆరోగ్య సిబ్బంది భయంతో పరుగులు తీశారు. పామును చంపేసి తీసుకొచ్చానని చెప్పుకొచ్చాడు. విషపూరితమైన పాము కాటువేసిందని ఆమెకు చికిత్స చేయాలని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పాము విషపూరితమైందని తెలియడంతో చికిత్స చేయడం సులభంగా మారిందని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News