Wednesday, April 24, 2024

పెళ్లైన ఎనిమిది నెలలకే భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

Husband kills wife at Nirmal district

కుంటాల: నిర్మల్ జిల్లాలోని కుంటాలలో ఓ భర్త తాను కట్టుకున్న భార్యను దారుణంగా హత్యచేశాడు. కుటుంబకలహాలతో భార్య గౌతమి(23)ని భర్త నిఖిల్ చంపేశాడు. ఎనిమిది నెలల క్రితం నిఖిల్, గౌతమికి వివాహం జరిగింది. నిందితుడు కుంటాలలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిఖిల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Husband kills wife at Nirmal district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News