భోపాల్: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, ప్రియుడిని భర్త చంపిన సంఘటన మధ్య ప్రదేశ్లోని భిండ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆనంద్ యాదవ్ అనే వ్యక్తి గ్వాలియర్లో దినసరి కూలీగా పని చేసేవాడు. ఆనంద్ భార్య సరోజా నూనె వ్యాపారి హరిఓం అగర్వాల్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యతో అతడు గొడవపెట్టుకున్నాడు. భార్యను, ఆమె ప్రియుడిని అంతం చేయాలని భర్త నిర్ణయం తీసుకున్నాడు. భార్యను తుపాకీతో కాల్చి చంపిన అనంతరం ఆమె ప్రియుడి వద్దకు వెళ్లి కత్తితో దాడి చేసి తుపాకీతో కాల్చి చంపాడు. డబుల్ మర్డర్ విషయం తెలియగాను స్థానిక ఎఎస్పి సంజీవ్ సింగ్ కాంచన్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిందితుడి మరో వ్యక్తి సహాయం తీసుకున్నట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.