Saturday, April 20, 2024

మరిపెడలో భర్త మర్మాంగాలు కోసిన భార్య…

- Advertisement -
- Advertisement -

Husband pennies cut by wife in Mahaboobabad

మహబూబాబాద్: భర్త మర్మాంగాలను భార్య కోసి హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల ప్రాంతంలో జరిగింది. భార్యతో పాటు ఆమె కుమారుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వాంకుడోతు తండాలో భూక్యా బీచ్యా, ప్రమీల అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉంది. బీచ్యా మద్యానికి బానిసగా మారాడు. బీచ్యా ప్రతీ రోజు మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడేవాడు. ప్రతీ రోజు వేధిస్తుండడంతో ఆమె అతడిని చంపాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం మద్యం సేవించి పడుకున్న బీచ్యా మర్మాంగాలను కోసింది. దీంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్‌ఐ ప్రవీణ్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News