Friday, April 26, 2024

రాజేంద్రనగర్ లో భార్య తలతో పోలీస్ స్టేషన్ కు

- Advertisement -
- Advertisement -

Husband reached police station with wifes head

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో భార్యను చంపి అనంతరం తలతో భర్త పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫర్వేజ్-సమీనా అనే దంపతులు ఇమాద్ నగరంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక సమీన్ విడాకులు తీసుకొని వేరుగా ఉంటుంది. వారం రోజుల క్రితం పెద్ద మనషుల సమక్షంలో సమ్రీన్‌కు నచ్చజెప్పి తన ఇంటికి ఫర్వేజ్ తీసుకొచ్చాడు. భార్యపై అనుమానంతో ఆమె హత్య చేసి అనంతరం మృతదేహం నుంచి తలను వేరు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News