Friday, April 19, 2024

దంపతుల మధ్య గొడవ…. కాల్పుల్లో గాయపడిన బంధువు

- Advertisement -
- Advertisement -

shoot

 

ఇస్రాజ్‌పల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. భార్యపై భర్త కాల్పులు జరుపుతుండగా ఆమె మేనమామ అడ్డురావడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీనివాస్, గీతిక అనే దంపతులకు గత ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్‌తో గీతికకు మనస్పర్థలు రావడంతో ఇస్రాజ్‌పల్లిలో ఉంటున్న తన మేనమామ రాజిరెడ్డి ఇంటికి వెళ్లిపోయింది. మేనమామ ఇంట్లో తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి శ్రీనివాస్ ఇస్రాజ్‌పల్లికి వచ్చి గీతికతో గొడవకు దిగాడు. గన్‌తో భార్యను కాలుస్తుండగా రాజిరెడ్డి అడ్డుగా వచ్చాడు. రాజిరెడ్డి ఛాతీలోకి బుల్లెట్లు దిగడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు డిఎస్‌పి వెంకట రమణ ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్‌కు తుపాకీ ఎక్కడ నుంచి తీసుకొచ్చాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Husband shoot on his wfe’s Father in law in Jagtial
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News