Friday, April 19, 2024

భార్య చెప్పినట్టు వినడం లేదని…. భర్త ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

 


నిజామాబాద్: ఓ వ్యక్తి తన భార్య మాట వినడం లేదని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గోసంగి కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్తడి కాశీరామ్, సాయమ్మ అనే దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులు సాయమ్మ, కాశీరామ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య తన మాట వినడం లేదని భర్త కాశీరామ్ మనస్థాపానికి గురయ్యాడు. మద్యం సేవించి భార్యతో గొడవ పెట్టకున్నాడు. భార్యభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో తాను చనిపోతానని వాటర్ ట్యాంక్ ఎక్కి బెదిరించాడు. భార్య తన మాట వింటేనే కిందకు దిగుతానని లేకపోతే దూకుతానని బెదిరించాడు. దీంతో గ్రామస్థులు సమాచారం మేరకు స్థానిక సిఐ, ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. నీ భార్య నీ మాట వినేలా మారుస్తామని సిఐ ప్రసాద్, ఎస్‌ఐ పాండేరావు హామీ ఇవ్వడంతో కాశీరామ్ కిందకు దిగాడు. భార్య ఫిర్యాదు మేరకు అతడిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News