Wednesday, April 24, 2024

ఆస్తి వివాదంలో భార్యను హత్యచేసిన భర్త

- Advertisement -
- Advertisement -

Husband who murdered his wife in property dispute

 

మన తెలంగాణ/చిన్నశంకరంపేట : ఆస్థిలో తన వాటాను అడిగినందుకు భార్యను భర్త హత్యచేసిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చెన్నాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారాల ప్రకారం… చెన్నాయిపల్లి గ్రామానికి చెందిన అత్తెల్లి మల్లేశంకు నార్సింగ్ మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన బుజ్జమ్మతో గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా గత మూడు సంవత్సరాల క్రితం ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిపించారు. కాగా ఆస్తి వివాదంలో మల్లెశంకు, బుజ్జమ్మకు తరుచుగా గొడవలు జరుగగా బుజ్జమ్మ తన తల్లి గారి ఇంటి వద్దే ఉంది. ఇదే అనువుగా భావించిన మల్లేశం అదే గ్రామమైన చెన్నాయిపల్లికి చెందిన ఎల్లవ్వను మరో వివాహం చేసుకున్నాడు. వీరిరువురికి కుమారుడు ఉన్నాడు.

కాగా విషయం తెలుసుకున్న బుజ్జమ్మ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి పెద్దల అంగీకారం మేరకు భర్త వద్దే నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఆస్తిలో తనవాటా తనకు కావాలంటూ బుజ్జమ్మ తరుచూ భర్తతో గొడలకు పాల్పడడంతో దీంతో భర్త మల్లేశం, చిన్న భార్య ఎల్లవ్వలు పథకం పన్ని బుజ్జమ్మను అంతమోందించాలని నిర్ణయించుకున్నారు. ఈ పథకం ప్రకారం శనివారం రాత్రి బుజ్జమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమె గొంతు నులిమి హత్యచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సిఐ నాగార్జునగౌడ్, ఎస్‌ఐ మహమ్మద్‌గౌస్‌లు తెలిపారు. ఈ మేరకు బుజ్జమ్మ అన్న శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంబానికి అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News