- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారితో నగరంలో పనిచేస్తున్న మరో పోలీసు అధికారి మృతిచెందాడు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో ఎఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న యూసుఫ్(47) కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరాడు. 20 రోజుల క్రితమే యూసుఫ్ కాలాపత్తర్ పిఎస్లో విధుల్లో చేరాడు. తీవ్ర జ్వరం రావడంతో ఆయన గత వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలడంతో నగరంలోని ఓ ప్రేవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతుండగా ఆరోగ్యం విషమించడంతో సోమవారం మృతిచెందాడు.
Hyderabad Police died due to Corona
- Advertisement -