- Advertisement -
న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం ఉదయం హైదరాబాద్ దంపతులు దుర్మరణం చెందారు. దంపతులు రాజా, దివ్య కారులో డల్లాస్ నుంచి ప్రిస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులు ముషీరాబాద్ ప్రాంతంలోని గాంధీనగర్కు చెందిన ఆవుల దివ్య, రాజాగా గుర్తించారు. దీంతో గాంధీ నగర్ లో విషాదచాయలు అలుముకున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -