ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. లాక్డౌన్తో షూటింగ్స్ నిలిచిపోవడంతో సెలబ్రిటీలు ఎవరూ కూడా ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. అందరూ ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నారు కాబట్టి సినిమా షూటింగులు జరుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం జూన్ నుంచి అనుమతినిచ్చింది. అయితే ఆ అనుమతి కూడా అతి తక్కువ మందితో షూటింగ్ జరుపుకునేందుకు మాత్రమే.
ఇక ఈమధ్య కాలంలో హాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఇండియాలోని ప్రతీ ఇండస్ట్రీలో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు కామన్ అయిపోయాయి. ఇవి లేకుంటే సినిమాలు చూసేందుకు యువ ప్రేక్షకులు కూడా పెద్దగా ముందుకు రావట్లేదు. కానీ తాజాగా కరోనా పుణ్యమా అని.. ఇకపై సినిమాలలో ముద్దు సీన్లు, బెడ్ సీన్లు ఉండకపోవచ్చు. ఇక ఈ రొమాంటిక్ సన్నివేశాలపై టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేసింది.
లాక్ డౌన్ తరువాత నేను ముద్దు సీన్లలో నటించను… అని స్ట్రెయిట్గా చెప్పేస్తోంది లావణ్య. అదేంటని అడిగితే.. ఎందుకైనా మంచిదని ముందుగానే ఈ విషయాన్ని చెబుతున్నానని అంటోంది ఈ బ్యూటీ. ఒకప్పుడు బికినీకి సిద్ధమన్న ఈ భామ ఇప్పుడు ముద్దు కూడా వద్దంటుండడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇదిలా ఉండగా ప్రసుత్తం లావణ్య చేతిలో ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ కాగా మరొకటి ‘చావు కబురు చల్లగా’. అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలో కూడా ఆమె నటించనుందని తెలిసింది.